కార్మికులకు నష్టం చేసే కార్మిక చట్టాల సవరణ ఆపివేయాలి

*కార్మికులకు నష్టం చేసే కార్మిక చట్టాల సవరణ ఆపివేయాలి*

*సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్*

*జమ్మికుంట జూన్ 18 ప్రశ్న ఆయుధం*

కార్మికులకు నష్టం కలిగించే కార్మిక నల్ల చట్టాలను ఆపివేయాలని సవరణ చేసిన కార్మికులకు మేలు కలిగించే విధంగా కార్మిక చట్టాలను సవరణ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జమ్మికుంట సిఐటియు మండల కమిటీ సమావేశం జక్కుల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్వహించగా సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పాల్గొని బుక్ లేట్ ఆవిష్కరణ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుమేరకు జూలై 9 వ తేదీన, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జమ్మికుంట మండల సిఐటియు కమిటీ కార్మికులందరూ పాల్గొంటారని జమ్మికుంటలో బుధవారం జరిగిన సమావేశంలో తీర్మానం చేశారు.

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చే ముందు అచ్చేదిన్ అగయ అంటూ నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీసుకొచ్చి కుటుంబాన్ని 15 లక్షలు పంచుతామని ప్రగల్బల్ పలీకీన, స్టార్ట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, దేశంలో కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, ఉన్న పరిశ్రమలు మూతబడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని రోజువారీ కూలీల కూడా పని దొరకడం లేదని, కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా, ఉన్న ఉద్యోగాలను, పర్మినెంట్ లేకుండా చేస్తూ, మొత్తం ప్రైవేటు కార్పోరేట్ ,అంబానీ అదానీ లాంటి కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మివేస్తూ దేశంలో మతోన్మాదం ప్రక్క దేశాలపై యుద్ధం పేరుతో ప్రజా సమస్యలను ప్రక్కదో వ పట్టిస్తూ అధికారమే ధ్యేయంగా అమెరికా అగ్రరాజ్యానికి భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతూ కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు, కార్మిక చట్టాల సవరణకు పూనుకుంటుందని దీన్ని ఎంత మాత్రం, కార్మిక సంఘాలు సహించమని గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి రైతులు ఉద్యమించి ప్రతిఘటించడంతో తలవంచి క్షమాపణ కోరిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, రేపు భవిష్యత్తులో కూడా కార్మిక చట్టాలను సవరణను అమలు చేస్తే బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం, కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని పేర్కొన్నారు తదుపరి పరిణామాలు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల సీనియర్ నాయకులు, సాగర్ల రాజయ్య మండల కమిటీ సభ్యులు, బహిరం సమ్మయ్య ,గడ్డం శోభన్, గేరా రాజకుమారి, చాగర్ల కుమార్, కొండ్రా క్రాంతి, ఖలీల్ పాషా, కన్నం సదానందం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment