నుడా అభివృద్ధికి కృషి చేస్తా చైర్మన్ కేశ వేణు
నియామక పత్రం అందజేసిన, కాంగ్రెస్ రాష్ట్ర రథసారధి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నూడా అభివృద్ధికి కృషి చేస్తానని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. నాపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినం దుకు అధిష్టానానికి, రాష్ట్ర నాయకులకు, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథా రిటీ చైర్మన్ గా కేశవ వేణుని ప్రభుత్వం నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసారు. శుక్రవారం హైదరాబాదులో నుడా చైర్మన్ గా కేశ వేణుకు, రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లు నియామకపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కేశవేణు శాలువాతో ఘనంగా సన్మానిం చారు. అనంతరం హైదరా బాదులోని గాంధీభవన్లో రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కేశ వేణు మర్యాదపూ ర్వకంగా కలసి సన్మానించారు.ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్ప కుండా గుర్తింపు ఉంటుద న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు.