Site icon PRASHNA AYUDHAM

సౌదీలో యువకుడిపై దాడి.. స్వదేశానికి రాగానే మృతి..!!*

IMG 20250711 WA00061

*సౌదీలో యువకుడిపై దాడి.. స్వదేశానికి రాగానే మృతి..!!*

 

జీవనోపాధి కోసం సౌదీ వెళ్లిన యువకుడు స్వదేశానికి రాగానే మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, నూకలమర్రికి చెందిన రాజు(21) డ్రైవింగ్ పని కోసం పది రోజుల క్రితం సౌదీ వెళ్లగా అక్కడ గొర్రెలు మేపడం, ఎడారిలో కూలి పనులు చేయించారు. తాను డ్రైవింగ్‌ పనికోసం వచ్చానని ప్రశ్నించడంతో అక్కడి యజమాని రాజుపై దాడి చేశారు. దీంతో రాజు తిరిగి స్వదేశానికి రాగానే కడుపు నొప్పితో రాజు హాస్పిటల్‌లో చేరాడు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతి చెందాడు..!!

Exit mobile version