*ఈ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ కు ఉత్తమ ప్రశంసా పత్రం…*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం
లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కారం చేసినందుకు ఈ బయ్యారం ఎస్ఐ రాజకుమార్ కు, కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు ప్రభుత్వం తరఫున ఉత్తమ ప్రశంసాపత్రం లభించింది.
ఈ ప్రశంసా పత్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రా చేతుల మీదుగా ఎస్ఐ రాజకుమార్, కానిస్టేబుల్ కిషోర్ అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజకుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లో రాజీ మార్గమే రాజ మార్గమని, సోదరభావంతో స్నేహపూర్వక వాతారణంలో ప్రజలు జీవించాలని ఆయన కోరారు. అవార్డును ఎస్పీ చేతుల మీదుగా అందుకోవడం తమకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ ను, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి , ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు…