*కేంద్ర ప్రభుత్వం విధానంతో పేద ప్రజలకు భారం కార్పోరేట్లకు లాభాలు*
*ఇల్లందకుంట ఏప్రిల్ 9 ప్రశ్న ఆయుధం*
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పేద ప్రజలకు బతుకు భారంగా మారిందని కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా ఉందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరి రాములు అన్నారు బుధవారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరీ రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసరించుకోవాలని కేంద్ర ప్రభుత్వ విధానం సరైనది పద్ధతి కాదని పెంచిన ధరలు పేద మధ్యతరగతి ప్రజల మీద అధిక భారం పడుతుందని అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగుతున్నప్పటికీ దేశంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం మాత్రం ధరలను పెంచుకుంటూ పోతుంది అని విమర్శించారు ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు అతలకుతులమవుతున్న ప్రతి జిల్లా మధ్యతరగతి పేద ప్రజలపై ఒక నెల సుమారు 600 కోట్ల భారం పడుతుందని వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు