Site icon PRASHNA AYUDHAM

నర్సాపూర్‌ పోచమ్మ ఆలయంలో చోరీ..

IMG 20250620 101155

Oplus_0

మెదక్/నర్సాపూర్, జూన్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున పోచమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయంలో అమ్మవారికి అలంకరించిన బంగారు ముక్కుపోగు, వెండి కండ్లు, ఇతర సామాగ్రిని గుర్తు తెలియని దొంగలు అపహరించారు. విషయం ఏమిటంటే ఈ ఆలయం నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంది. అయినప్పటికీ దొంగలు ఆలయం తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి అమ్మవారి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయ నిర్వాహకులు వచ్చి చూసేసరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని, ఆలయాలకు భద్రత కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version