విద్యార్థుల స్కాలర్షిప్ లను 20 వేలకు పెంచాలి కలెక్టర్ కు వినతి..
-జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్
హైదరాబాద్ డేస్క్ ఖమ్మం
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:
రాష్ట్ర ప్రభుత్వం బీసీ /ఏబీసీ / ఎస్సీ / ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఫీజులు బకాయిలు చెల్లించకుండా ఏళ్లు తరబడి జాప్యం చేస్తుంది . వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయాలని మంగళవారం నాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడేపల్లి కృష్ణ చారితో కలిసి కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు . అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో కాలేజి కోర్సులు చదివే 20 లక్షల మంది విద్యార్హులకు – ఫీజులు – స్కాలర్ షిప్ లకు ఇవ్వటానికి బడ్జెటు ఉండదా ? ప్రభుత్వం వచ్చి పది నెలలు గడిచిన కూడా విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వకపోవడం కనీసం కొనసాగుతున్న స్కిములకు కూడ బడ్జెట్ ఇవ్వడం లేదు అని ఫీజుల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీ లెక్చరర్లకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు అని అద్దె భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో చాలా దారుణం అని అన్నారు . కాలేజీ యాజమాన్యాలు అప్పుల పాలై నానా ఇబ్బందులు పడుతున్నారు అని శ్రీనివాస్ అన్నారు . పేద కులాలు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వకుండా స్కాలర్ షిప్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు అని ఇంజనీరింగ్ /ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు . ఎస్.టి/ఎస్.సి/మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగానే బిసి/ ఈబిసి విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఇంజినీరింగ్ , ఫార్మసి , మెడికల్ , పి.జి., డిగ్రీ ఇంటర్ విద్యార్థులకు సగం ఫీజులు మాత్రమే మంజూరు చేస్తున్నారు అని మిగితా ఫీజులు కట్టలేక చాలామంది విద్యార్ధులు చదువు మానేస్తున్నారు అని మొత్తం ఫీజులు మంజూరు చేస్తే ప్రభుత్వానికి అదనంగా 150 కోట్లు మాత్రమే భారం పడుతుంది అని పెరిగిన ధరల ప్రకారం డే స్కాలర్స్ స్కాలర్ షిప్స్ ను సంవత్సరానికి రూ.5500 నుంచి 20 వేలకు పెంచాలని శ్రీనివాస్ పేర్కొన్నారు . గత 8 సంవత్సరాల కాలంలో నిత్యవసర ధరలు , పప్పు , నూనెలు , కూరగాయలు , ఇతర ఆహార వస్తువుల ధరలు , ఇంటి అద్దె రెండు నుంచి నాలుగు రెట్లు పెరిగాయి . పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ లను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బీసీ మైనారిటీ విద్యార్థుల గత రెండు సం. ఫీజుల బకాయిలు 4 వేల కోట్లు వెంటనే చెల్లించాలి , ఇంజనీరింగ్ పి.జి. డిగ్రీ- ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే బీసీ / ఇబీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలి , ఈ స్కీమును 2008 పెట్టినట్లుగా యదాతధంగా ఆమలు చేయాలి , కాలేజి ద్యార్థులకు సంవత్సరం కు 20 వేల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్థికి నుంజూరుచేయాలి , ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ రేటు రూ.1800 నుండి రూ.15 వేలకు పెంచాలి . మొత్తం ప్రభుత్వమే మంజూరు చేయాలి , విదేశీ విద్యాకు అమెరికా , ఇంగ్లాండ్ , కెనడా , స్టేలియా లో చదివే విద్యార్థులందరికి రూ. 20 లక్షల “స్టై ఫండు” మంజూరు చేయాలి , బి.సి. కాలేజి హాస్టళ్లకు , గురుకుల పాటశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి , ఐఐటీ / ఐఐమ్ కోర్సులు చదివే వారికీ ఫీజు రియంబర్స్ మెంట్ పథకం అనులు చేయాలని కోరారు . బి.సి స్టడీ సర్కిల్ బడ్జెట్ ను 200 కోట్లకు పెంచాలి . అన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలి . కోచింగ్ వారికి న్లకు 5వేల స్టై ఫండు ఇవ్వాలి . ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు , ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య , ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శి కే నాగేశ్వరరావు , బలుసుపాటి ధనేశ్వరరావు , వెంకటేశ్వర తదితరులు ఉన్నారు .