పల్నాడులో వేటకొడవళ్ల కలకలం ..

ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత అల్లర్ల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పల్నాడులో గురజాల నియోజకవర్గం దైద గ్రామంలో వేటకొడవళ్లు కలకలం రేపాయి. పల్నాడు లోనే అత్యంత సమస్యాత్మక గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరాటం రగులుతూనే ఉంది. ఒకరిపై మరొకరు దాడులు ఆగలేదు. ఈ నేపథ్యంలో దైద గ్రామంలో వేటకొడవళ్లు బయటపడటం తీవ్ర చర్చనీయాంశమైంది. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే నరాల హనుమంతరావు అనే వ్యక్తి అక్కడికి వెళ్లి చూశాడు. అక్కడ వేటకొడవళ్ల మూటను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. తమకు దొరికిన ఈ వేటకొడవళ్ల అంశంపై అన్ని కోణాల్లోనూ గురజాల సీఐ బాలకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.IMG 20240804 WA0091 1

Join WhatsApp

Join Now