విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్ మెంట్స్ ను స్కాలర్షిప్స్ ను వెంటనే విడుదల చేయాలి

రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి

ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను

సిద్దిపేట అక్టోబర్ 16 ప్రశ్న ఆయుధం :

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను డిమాండ్ చేశాడు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్ల దాకా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్ బకాయిలు విడుదల కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యజమాన్యాలు మేము కాలేజీలు నడపలేమని బంధు నిర్వహించి దీక్షలు చేపట్టారన్నారు ప్రైవేటు యజమాన్యాలు కళాశాలలు బందు పెట్టడం వలన విద్యార్థులు అయోమయంలో పడుతున్నారన్నారు ఇంత జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం ఎందుకు విద్య రంగా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులలకు సొంత భవనాలు లేవన్నారు. అద్దె భవనాల్లో ఉండడం వలన దసరా సెలవులు అయిపోయిన తర్వాత గురుకులాల కు వెళ్తే ప్రభుత్వం ఆ అద్దె భవనాల కిరాయి చెల్లించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి భవనాల యజమానులు గేట్లకు తాళాలు వేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అన్నారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రానికి విద్య శాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పైన స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను అలాగే స్కాలర్షిప్స్ ను వెంటనే విడుదల చేయాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల కు సొంత భవనాలు నిర్మించాలి అని అన్నారు లేదంటే సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ నాయకులు నవదీప్ సాయి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now