కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలి

*కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలి*

*మాట ఇచ్చిన ప్రకారం బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇవ్వాలి*

*మతాల పేరిట రిజర్వేషన్ చెల్లదు*

*బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్*

*కరీంనగర్ జూలై 18 ప్రశ్న ఆయుధం*

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% బిసి రిజర్వేషన్లు ఇవ్వాలని 42% బిసి బిల్లులో మతాలకు ప్రవేశం లేదని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ అన్నారు శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% అని చెప్పి అందులో ముస్లిం మతస్తులను బిసి ఈ కింద చేర్చడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ పెంచుతున్నామంటూ ప్రగల్బాలు పలికి చట్టసభలో 42 శాతం బీసీలకు విద్యా,ఉద్యోగ,ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని ఈ బిల్లు ప్రవేశపెట్టిన విధానమే ఒక పెద్ద మోసపూరితమని బీసీలను,హిందువులను అనాది కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే వస్తుందని బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇప్పటివరకు ఉన్న కులాలతో పాటు అదనంగా కొత్త కులాలను చేర్చి జనాభా దామాషా పద్ధతిలో కాకుండా అశాస్త్రీయంగా బీసీలలోని వివిధ గ్రూపులను విభజించి అందులో వివిధ కులాలను చేర్చడమే కాదు బీసీలను మోసం చేసే చర్యకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త వివాదానికి తెర లేపడం చూస్తుంటే బీసీల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల పబ్బం గడుపుకోవాలనే కుట్రపూరిత కనబడుతుందని

భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో వెనుకబడిన తరగతులు అంటే ఈ దేశంలో ఉన్న వెనుకబడిన కులాలు మాత్రమే. అయితే ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు అని భారత రాజ్యాంగం ద్వారా వివిధ న్యాయస్థానాలలో తీర్పులు ఇవ్వడం జరిగిందని కానీ ఈ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నామని చెప్తూనే బీసీ కులాలలో బీసీ ఇ పేరుతో ఒక కొత్త గ్రూపును చేర్చి దాన్లో మత ప్రాతిపదికన ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం చూస్తుంటే గతంలో ఉన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన శాతాలను తగ్గించడమే కాదు ముస్లిం మతానికి రిజర్వేషన్ అందించి బీసీలను మోసం చేస్తూ బీసీల జాబితాలో బిసి ఈ అనే పేరుతో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ పెంచడం మోసపూరిత చర్యఅని అభివర్ణించారు

ముస్లింలకు కేటాయించిన 10 శాతం బీసీ రిజర్వేషన్ తీసేస్తే బీసీలకు మిగిలింది కేవలం 32 శాతం మాత్రమే గతంలో 29% లో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ పేరుతో బీసీ రిజర్వేషన్ మింగి వేయడం చూసాం. దానితోపాటు అది సరిపోదు అన్నట్టుగా మళ్లీ ఇంకొక ఆరు శాతం కలిపి మొత్తం 10% బీసీఈ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇది పూర్తిగా వెనుకబడిన కులాలను,తరగతులను మోసం చేయడమే

పేర్కొన్నారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పక్కకు పెట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు దక్కాల్సిన బీసీ రిజర్వేషన్లను పెంచి వెంటనే రాష్ట్ర చట్టసభల్లోనే నిర్ణయం తీసుకోవాలని, బీసీ రిజర్వేషన్ల పెంపుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సిన చర్య అని తెలియజేస్తూ వెంటనే ముస్లిం మత ప్రాతిపదికన కేటాయించిన బీసీఈ 10 శాతం రిజర్వేషన్ తొలగించి బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెంట శ్రీనివాస్ శానకొండ వాసు, మంతెన కిరణ్, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, ఉమ్మడి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి, మంద వెంకన్న, గుడిసెల రమేష్ గౌడ్, అజయ్, గుంపట మురళి, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment