పల్లె పల్లెకు కాంగ్రెస్… ప్రజలవద్దకు కాంగ్రెస్… ప్రజచైతన్యం అభివృద్ధికి నాంది..
కూకట్పల్లి..ప్రశ్న ఆయుధం..ఆగస్టు 1
కూకట్పల్లి నియోజకవర్గం,
టిఫిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, తలపెట్టిన పల్లె పల్లెకు కాంగ్రెస్, ప్రజలవద్దకు కాంగ్రెస్, ప్రజాచైతన్యం అభివృద్ధికి నాంది..జనహిత పాదయాత్ర రెండవ రోజు అందోల్ నియోజకవర్గంలో మంత్రివర్యులు దామోదర రాజానర్సింహా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో టిఫిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.