Site icon PRASHNA AYUDHAM

రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకుల చేతిలో దేశం మగ్గుతోంది.

IMG 20250213 WA0380

ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చేసే పనిలో కేంద్ర బీజేపి.
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మావోయిస్టులు 2026 మార్చ్ వరకు లేకుండా చేస్తాం అంటున్న అమిత్ షా మాటలకు అర్థం ఏంటి?
ప్రజలకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది ఎర్ర జెండానే.
సమ సమాజ స్థాపన-సోసిలిస్టు రాజ్యమే సీపీఐ లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిపిఐ సిద్ధం
సీపీఐ శత వసంతోత్సవాలు పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణంకోసం నాంది కావాలి.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
పాల్వంచలో జరిగిన సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యులు సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని. మాట్లాడారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా రాజకీయ, కార్యక్రమాల నివేదిక ప్రవేశపెట్టరు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, సర్ రెడ్డి పుల్లారెడ్డి, ఎస్డి సలీం, కే సారయ్య, కల్లూరి వెంకటేశ్వరరావు, కమటం వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మి కుమారి, నారాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, దేవరకొండ శంకర్, పట్టణ మండల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Exit mobile version