విజయదశమి పర్వదినం రైతు సోదరుల ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుంది

*IMG 20241013 WA1111

     —రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల

 

విజయదశమి, దసరా పర్వదినం తెలంగాణ రాష్ట్ర ప్రజల, రైతు సోదరుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుందని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. 

 

దసరా సందర్భంగా శనివారం *కొత్వాల* పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం పెద్దమ్మతల్లి కి, సూరారం నర్సమ్మతల్లి కి, పాత పాల్వంచ లోని మైసమ్మతల్లి దేవాలయాల్లో పూజలు జరిపారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. 

 

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గత 9 రోజులుగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుకొని, దసరా పండుగ రోజు ప్రజలందరూ తమ కుటుంబసభ్యులతో ఆనందంగా, ప్రశాంతంగా గడపాలని అమ్మవారిని వేడుకున్నానని కొత్వాల అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో *మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, బానోత్ బాలాజీ, గంధం నర్సింహారావు, కామచారి, చౌగాని పాపారావు, జామ్లా, శంకర్, భావ్ సింగ్, జక్కుల, మసనం శరత్, వంగా రమేష్, కిరణ్*, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now