భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం

*భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం*

ప్రశ్న ఆయుధం న్యూస్ 27 డిసెంబర్ గాంధారి

కామారెడ్డి జిల్లాగాంధారీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతు 2 నిమిషాల పాటు మౌనం పాటించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ . ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత. మన్మోహన్ సింగ్ . భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు మన్మోహన్ సింగ్ . రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి అని తెలిపారు.

సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎటువంటి సమస్య లేకుండా నడిపిన సమర్థ నాయకుడు మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించి. మన రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావుడు

విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలు ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి రాగా.అవి నేటికీఉపయోగ పడుతున్న విషయం తెలిసిందే.

నేడు భౌతికంగా మన్మోహన్ సింగ్ మనకి దూరమైన.ఆయన ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరంపునరంకితమవుతాం అని మదన్ మోహన్ మాట్లాడరు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. , వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, సీనియర్ నాయకులు తూర్పు రాజులు, మండల ప్రెసిడెంట్ మోహన్ నాయక్, మాజీ ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్, సొసైటీ డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, గడ శంకర్, గాంధారి టౌన్ అధ్యక్షులు సంగని బాబా, లైన్ రమేష్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, సంగని బాలయ్య, నీళ్ల రవి, బిస గణేష్, ఆరోల్ల మధుకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now