*సీఏలకు భారీగా పెరగనున్న డిమాండ్*
ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా భారత్ పరుగులు పెడుతోంది. భారీ ఎత్తున కంపెనీల స్థాపన జరుగుతుండటంతో చార్టర్డ్ అకౌంటెంట్లకు అనూహ్య డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. *దేశంలో ప్రస్తుతం 4.85 లక్షల మంది సీఏలు ఉంటే, 2050 సం.లో మార్కెట్కు 50 లక్షల మంది అవసరమని ICAI ప్రెసిడెంట్ చరణ్ జోత్ సింగ్ నందా ఇటీవలే పేర్కొన్నారు.* దీన్నిబట్టి చూస్తే సీఏలకు మున్ముందు ఉండే డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.