బిజేపితోనే గ్రామాల అభివృద్ధి

బిజేపితోనే గ్రామాల అభివృద్ధి

*కన్నాపూర్ లో బోరుబావి ప్రారంభించిన బిజెపి మండల అధ్యక్షులు ఎనుగుల అనిల్*

*శంకరపట్నం అక్టోబర్ 12 ప్రశ్న ఆయుధం*

గ్రామాల అభివృద్ధి బిజెపి తోనే సాధ్యమని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయబడుతున్నాయని బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ అన్నారు. శనివారం శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో తన ఎంపీ నిధుల నుండి వేసిన బోరుబావుల ప్రారంభం సందర్భంగా ఎనుగుల అనిల్ మాట్లాడుతూ కన్నాపూర్ గ్రామస్తులు కోరగానే స్పందించిన కేంద్రమంత్రి బోరుబావిని వేయించడం జరిగిందని

పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామా ప్రజలు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కి, బిజెపి మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ కు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రెడ్డి నరేందర్.నాయకులు కొయ్యడ అశోక్, మందడి జగ్గారెడ్డి, దాసరి సంపత్, ఎల్కపెల్లి సంపత్, జానపట్ల రాజిరెడ్డి . వీరార్జున్ . దాసరి సంపత్.జాలి రమణారెడ్డి నాంపెల్లి రవి, రాజిరెడ్డి.మాజీ ఉపసర్పంచ్ మల్లేశం. ముదిరాజ్ సంఘం నాయకులు నూనె పోశయ్య. భూమయ్య . సత్యనారాయణ.లతోపాటు బిజేపి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment