కరీంనగర్ ఫిలిం భవన్ లో ఏర్పాటు చేసిన చర్చ గోస్ట్ శ్రీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన డాక్టర్ బి ఎన్ రావు ప్రస్తుత విద్యా విధానంలో ఆధునిక మార్పులు అవశ్యము ఉందని తద్వారా నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక పద్ధతుల
ద్వారా సమాజంలో విద్య వ్యవస్థలో అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా మార్పులు తీసుకురావాలని ముఖ్య అతిథిగా ప్రసంగించారు నాణ్యమైన విద్యుత్ తో పాటు పాఠశాల కళాశాల యూనివర్సిటీ స్థాయిల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి తద్వారా విద్యావ్యాప్తికి ప్రభుత్వం కృషి చేయాలని సూచన చేశారు ఆ సూచనలతో పాటుగా దానికి తగిన విధంగా విద్య వ్యవస్థకు బడ్జెట్ను కేటాయించాలని కేటాయించిన బడ్జెట్ను విడుదల చేయాలని కూడా ముఖ్యఅతిథి డాక్టర్ బి.ఎన్ రావు కోరడం జరిగింది విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత అప్రెంటిస్ విధానాన్ని అన్ని స్థాయిల్లో ప్రవేశపెట్టి తద్వారా కోర్సుల్లో నేర్చుకున్నటువంటి విద్యా విధానాన్ని కళాశాల బయట ఆ నైపుణ్యాన్ని వినియోగించుకునే విధంగా ప్రవేశపెట్టాలని అప్రెంటిస్ విధానాన్ని సూచించడం జరిగింది మరోవైపు నిరుద్యోగ సమస్య కూడా అధికంగా ఉందని నిరక్షరాశులయినా నిరుద్యోగులు మూడు శాతం గా ఉంటే అక్షరాసులైన నిరుద్యోగుల సంఖ్య 209 శాతానికంటే అధికంగా ఉందని దీనికి కారణం విద్యార్థుల్లో నాణ్యమైన నైపుణ్యమైన విద్య అందకపోవడమే అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు తదనంతరం విదేశాల్లో విద్యనభ్యసించడానికి దేశం నుంచి అనేకమంది విద్యార్థులు విదేశాలకు వెళ్లడం వల్ల మన ఆర్థిక సంపద విదేశాలకు వెళుతుందని మన దగ్గర తగిన విధంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి వనరులను ఏర్పాటు చేసి ఉన్నత విద్య శరవేగంగా అభివృద్ధి చెందడం కొరకు సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు వైభవ్ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో 11 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉండడం జరిగిందని ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు తగిన నైపుణ్యత కల అర్హులు కొరత ఉందని ఈ ఉద్యోగ ఖాళీల ద్వారా మనకు అర్థం అవుతుందని చెప్పారు మన దేశంలో ప్రతి 1,000 మందిలో ఒకటి రెండు లేదా అంతకంటే తక్కువ స్థాయిలోనే ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని ఇది ఇది ప్రభుత్వ నియమాకాలు జరపకపోవడమే దీనికి కారణం అని తెలిపారు అందుకని బడ్జెట్లో నైపుణ్యత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ నిర్మూలన జరుగుతుందని తద్వారా సమాజంలో నిరుద్యోగ సమస్య తగ్గిపోయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చూపెట్టారు తాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తద్వారా విద్యా వ్యవస్థ పై నిరుద్యోగ వ్యవస్థలపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఈ పై సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తద్వారా ఆయన రంగాల్లో సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఈ విధంగా సభలో మాట్లాడుతూ ప్రసంగించడం జరిగింది విశిష్ట అతిథిగా హరికాంత్ ప్రసంగించడం జరిగింది వారి ప్రసంగంలో కేవలం విద్యా వ్యవస్థలో ప్రమోట్ పాస్ విధానాన్ని చూస్తున్నారని తద్వారా విద్యా వ్యవస్థలో నాణ్యత తగ్గిపోయిందని నాణ్యమైన విద్య అభ్యసించాలనుకుంటే పూర్తిస్థాయిలో అధ్యాపకులు నేను నియమించాలని అందుకు అవసరమైనటువంటి వనరులను సమకూర్చాలని దానికి అవసరం మేరకు బడ్జెట్ కేటాయించాలని విద్యా వ్యవస్థలో ప్రధాన అంశంగా పరిశీల నుంచి దానికి అనుకూలంగా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారుడాక్టర్ నరేష్ మాట్లాడుతూ విద్యావ్యవస్థలో ఆధునిక విధానాలను ఎప్పటికప్పుడు వినియోగించుకుంటూ నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించానని తద్వారా నాణ్యమైన విద్యతో పాటు పోటీ ప్రపంచానికి అనుకూలమైన విద్యార్థులలో నైపుణ్యం గల యువతలో దేశానికి సమాజానికి అందించిన వారం అవుతామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులు ప్రత్యేక ఆహ్వానితులు ఆహ్వానం సంఘం సభ్యులు మాట్లాడి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన విధానాలను విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టాలని తద్వారా నైపుణ్యమైన యువతను సమాజానికి అందించిన వాళ్ళం అవుతామని తద్వారా నిరుద్యోగ సమస్య నిర్మూలనకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని వక్తలు అభిప్రాయాన్ని వ్యక్తపరిచినారు.