సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజా పాలన, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ధాన్య సేకరణ, సీఎంఆర్ డెలివరీ, రేషన్ పంపిణీ, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2023–24 రబీ సీజన్ కింద సిఎంఆర్ (సిఎంఆర్) కింద బియ్యం పెట్టడం 94 శాతం లక్ష్యం పూర్తయ్యిందని, మిగిలిన 6 శాతం సిఎంఆర్ పూర్తి చేయాలని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. తొమ్మిది మిల్లుల నుండి సరఫరా కావలసిన సిఎంఆర్ తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2024-25 ఖరీఫ్ అండ్ రబీ సీజన్లలో సిఎంఆర్ డెలివరీ లక్ష్యాలపై ప్రణాళికలు ముందుగానే వ్యూహాత్మక గా రూపొందించుకోవాలని, కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు రైతుల నుండి మొత్తం 1,47,290 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని ఈ సందర్భంగా సివిల్ సప్లై శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలోనే డబ్భులు వారి వారి బ్యాంకు కలలో జమాయినట్లు అధికారులు వివరించారు అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ విధానం ఎలా సాగుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించాలని అన్నారు. ప్రజా పాలన, మీ సేవా కేంద్రాల ద్వారా అందిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై విచారణ తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అసలైన లబ్ధిదారులకు ఆలస్యం లేకుండా కార్డులు జారీ చేయడం అత్యవసరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీటీ సివిల్ సప్లై అధికారులు, రేషన్ షాపులను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలనీ, నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు సమయానికి అందేలా పర్యవేక్షణ మరింత మెరుగు పర్చాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు, విద్యాశాఖతో సమన్వయంతో గ్యాస్ కనెక్షన్ల కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. పిల్లలకు భద్రమైన వంట గదులు, అవసరమైన వంట గ్యాస్ కనెక్షన్లతో విద్యాసంస్థలు సమకూర్చుకోవడం కోసం, సివిల్ సప్లై శాఖ తనవంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ జిల్లా సివిల్ సప్లై అధికారిని, బాల సరోజ, సివిల్ సప్లై మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

Oplus_0