Site icon PRASHNA AYUDHAM

కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలి జిల్లా కలెక్టర్..

GridArt 20241113 191556267

కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలి జిల్లా కలెక్టర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 13:

కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం యొక్క తేమశాతం పరిశీలించి, నిబంధనల మేరకు కొనుగోలు చేయాలనీ, కొనుగోలు చేసిన ధాన్యం ను సెంటర్ కు కేటాయించిన రైస్ మిల్లుకు తరలించాలని తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం ను ట్యాబ్ ఎంట్రీ చేయాలని తెలిపారు. రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహీల్దార్ రహీముద్దీన్, సెంటర్ ఇన్చార్జి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version