సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు ప్రశంస
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మణుగూరు కొండాపురం భూగర్భగనిని సందర్శించిన
సింగరేణి ఎస్ సి ఎస్ టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కష్టంతో నష్టాన్ని నివారించిన సింగరేణి రెస్క్యూ టీం, కొండాపురం భూగర్భకాని ఉద్యోగుల శ్రమ అభినందనీయమని సింగరేణి ఎస్ సి,ఎస్ టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు ప్రశంసల వర్షం కురిపించారు. మణుగూరు కొండాపురం భూగర్భ గనిలోకి నాలుగు రోజుల క్రితం అనూహ్యంగా నీరు చేరుకుందన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన సింగరేణి అధికారుల అనుమతితో తమ సంఘం సభ్యులతో కలిసి వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించి శుక్రవారం నాడు కొండాపురం భూగర్భగనిని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ గనుల్లో ప్రకృతి వైపరీత్యం ప్రభావం మరియు విపత్తులు సాధారణమేనని సరైన ప్రణాళికతో సింగరేణి రెస్క్యూ టీం సహకారంతో యుద్ధ ప్రాతిపదికన వాటి తీవ్రతను తగ్గించుకోవటంలో కొండాపురం భూగర్భగని అధికారులు కార్మికులు విజయం సాధించారని అన్నారు. నాలుగు రోజుల క్రితం మణుగూరు ఏరియా కొండాపురం గని లో అనూహ్యంగా నీరు చేరటంతో గని ప్రాజెక్ట్ అధికారి పి వీరభద్రరావు,మేనేజర్ బైరెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో పరిస్థితి అంచనా వేసి గని ఉద్యోగుల సహకారంతో ప్రకారం అక్కడ రెస్క్యూ టీమ్ సభ్యులు, ఉద్యోగుల సహకారంతో బాహుబలి పంపులతో గనిలోకి చేరుకున్న నీటిని బయటకు పంపించే విషయంలో అధికారుల సూపర్వైజర్ల కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం అన్నారు. అనంతరం గని లో జరుగుతున్న పనులను కూడాతెలుసుకోవటం జరిగిందన్నారు. సింగరేణి సి ఎం డి ఎన్ బలరాం (ఐఆర్ఎస్) సలహాలు. జి వెంకటేశ్వర రెడ్డి డైరెక్టర్ పా మరియు పి పి మరియు డి సత్యనారాయణ డైరెక్టర్ ఈ అండ్ ఎం సూచనలు మరియు ఆపరేషన్స్ ఏరియా జిఎం దుర్గం రాంచందర్ మేనేజర్ తోడ్పాటుతో ఎప్పుడు కప్పుడు వారి సలహాలు తీసుకొని గని లో ఆధునిక మోటర్ పంపులను అమర్చి వచ్చిన నీటిని తోడి ఎప్పటికి కప్పుడు బయటకు పంపటంతో నీటిమట్టం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని వీలైనంత త్వరగా గనిలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతుందని మేనేజర్ బైరెడ్డి వెంకటేశ్వర్లు తమకు వివరించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గని అధికారులకు ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీసు ఎస్ సి,ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జిమ్మడిమల్లేష్ , ఉపాధ్యక్షులు శనిగరపు కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి రెస్క్యూ బృందం,కే పి యు జి ఉద్యోగుల శ్రమ అభినందనీయం
by Naddi Sai
Published On: December 13, 2024 8:18 pm
