కడప జిల్లాలో పేలుడు కలకలం రేపింది..
మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్ఏ ని హత్య చేయడం సంచలనంగా మారింది. వేముల మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తున్నారు.. అయితే ఆయన మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చడంతో ఆయన ఎక్కడికీ అక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో వీఆర్ఏ నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధం విషయంలో పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు..బాబు అనే వ్యక్తి ఈ పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు.అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.