కడప జిల్లాలో పేలుడు కలకలం రేపింది..

కడప జిల్లాలో పేలుడు కలకలం రేపింది..

IMG 20240930 WA0054 1

మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్‌ఏ  ని హత్య చేయడం సంచలనంగా మారింది. వేముల మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తున్నారు.. అయితే ఆయన మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చడంతో ఆయన ఎక్కడికీ అక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో వీఆర్‌ఏ నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధం విషయంలో పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు..బాబు అనే వ్యక్తి ఈ పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు.అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now