బాలరాముని జయంతి సందర్భంగా పెద్ద కొడప్గల్ లో జెండా ఆవిష్కరణ 

బాలరాముని జయంతి సందర్భంగా పెద్ద కొడప్గల్ లో జెండా ఆవిష్కరణ

కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం) సెప్టెంబర్ 01

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో రైతులంతా ఒక సంఘటితం అయ్యి రైతుల సమస్యల పరిష్కారం కోసం పని చేయడమే భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి పేర్కొన్నారు. బాలరాముని జయంతి సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… లాభసాటి ధర కోసమే భారతీయ కిసాన్ సంఘం పని పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశం లో అతి దయనీయ స్థితిలో ఉన్న ఏకైక రంగం వ్యవసాయ రంగమని, రైతును రాజు చేయడం కోసమే పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం లో అన్ని గ్రామాల్లో కిసాన్ సంఘం కమిటీలు పూర్తి చేసుకొని, రైతు సమస్యల కోసం పని చేయాలా రైతులు సంఘటితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమం లో కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షులు విట్టల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, బాసర డివిజన్ గౌరవాధ్యక్షులు హన్మంత్ రెడ్డి, పెద్ద కోడప్ గల్ మండల అధ్యక్షులు బస్వారాజ్ దేశాయ్, గ్రామ అధ్యక్షులు కుమార్ సింగ్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు సౌదగర్ గంగారాం, సోసైటీ చైర్మన్ చెన్న రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, బి ఆర్. ఎస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కొండ విట్టల్, బీజేపీ మండల అధ్యక్షులు సుభాష్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కృష్ణ పంతులు, పెద్ద కోడప్ గల్ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు కల్లూరి పండరి, మండల కార్యదర్శి బోడి రాజు యాదవ్, సహాయం కార్యదర్శి బోడి మల్లికార్జున్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు జైత్రం, డివిజన్ కమిటీ సభ్యులు దెమే నరేందర్, ములుగు సంజీవరెడ్డి, పెల్య దేవుసింగ్, అఫ్రోజ్, కల్లూరి మహేందర్, జక్కుల అంజయ్య, మండల అన్ని గ్రామాలకి సత్సంగం కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment