_ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో గౌతమి గోదావరి నది చెంతన ఉన్న పుష్కర ఘాట్ కు పూర్వ వైభవం లభించిందని పలువురు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అన్నారు. సోమవారం గ్రామ తెలుగుదేశం నాయకులు తాడి శ్రీనివాసరెడ్డి( బట్టి శ్రీను) ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ ను శుభ్రపరిచే పనులను ప్రారంభించారు. గోదావరి వరదలు కారణంగా పేరుకుపోయిన మట్టి వ్యర్ధాలను భారీ యంత్రాలతో తొలగించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..భక్తులకు అణువుగా గోదావరి పుణ్య స్నానాలు చేసేందుకు ఈ ఘాట్ను ఏర్పాటు చేస్తున్నామని, గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ ప్రాంతాన్ని కాలుష్య నివారణ ప్రాంతంగా తీర్చిదిద్ది భక్తులకు విహార ప్రదేశంగా అందజేయడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. అనంతరం అక్కడే ఉన్న స్మశానవాటిక పరిసర ప్రాంతంలోని పచ్చిగడ్డి వ్యర్ధాలను తొలగించి, గ్రామస్తులు పిండ ప్రధాన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనువుగా ఏర్పాటు చేశారు._
Latest News
