Site icon PRASHNA AYUDHAM

విద్య రంగ సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

IMG 20250625 WA0340

విద్య రంగ సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

– ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి భానోత్ రఘురాం నాయక్.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 25

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) కామారెడ్డి జిల్లా సమితి అధ్వర్యంలో కామారెడ్డి పట్టణం లోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయం లో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల ప్రారంభమై నేటికీ 15 రోజులు అవుతున్న విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు అదేవిధంగా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఖాళీగా ఉన్నఎటువంటి టీచింగ్ పోస్టులు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని దాంతో పాటు వర్షాకాలం విద్యార్థులకు స్థితుల వ్యవస్థలో ఉన్న భవనాలు ఉండటం వలన వర్షాకాలంలో వర్షాలు పడి పెచ్చులు ఊడి, భవనాలలో నీరు కారుతూ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదని అన్నారు. వెంటనే విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు దాంతోపాటు టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని, అద్దె భవనాలు నడుస్తున్న గురుకుల పాఠశాలలో సొంత భావన నిర్మించాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి శివప్రసాద్, ఎల్ సంపత్,సనత్,కుషాల్, రమేష్, శ్రీను పాల్గొన్నారు.

Exit mobile version