దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలుకు దివ్యాంగుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
– మాజీ మంత్రికి వినతి ఇచ్చిన విద్యను వికలాంగుల సేవా సమితి నాయకులు
మాజీ మంత్రి , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలవడం జరిగిందనీ విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రభుత్వం ఎన్నికల కురుక్షేత్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మా తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరడం జరిగిందన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం, కొత్త పెన్షన్ అంటు ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, మాపై చిన్న చూపు అన్నారు. 6000 రూపాయల పెన్షన్ పెంపు, ఉచిత రావాణా సౌకర్యం, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ, ఉన్నత విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు, ఏఐసీసీ మెనిఫేస్టో ప్రకారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు అని హరీష్ రావుకు వివరించడం జరిగిందన్నారు. దినికి తన్నీరు హరీష్ రావు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా ప్రభుత్వం దృష్టికి దివ్యాంగుల సంక్షేమం కోసం మాట్లాడుతామని అన్నారన్నారు. ఈకార్యక్రమంలో సబ్ వైస్ చైర్మన్ నితీష్ రెడ్డి పాల్గొన్నారు.