*ఘనంగా శ్రీ కొమురవెల్లి మల్లన్న దేవదేవుని కళ్యాణ మహోత్సవం*
*కొమురవెల్లి ప్రశ్ని ఆయుధం ప్రతినిధి*
ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో శ్రీ శ్రీ శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి
, జోగినులు, పోతరాజు ల విన్యాసాలు, పూనకాలు, బోనాలు, డప్పు దరువుల తో కోరమీసాల మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మ తో స్వామి కొలువు దీరిన కొమురవెల్లి మల్లన్న క్షేత్రం
మారు మోగింది ప్రతిఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నిర్వహిం చే కల్యాణంతో బ్రహ్మోత్స వాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి మల్లన్న జాతర సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే ఆదివారం నుంచి ఫాల్గుణ మాసం చివరి ఆదివారం రాత్రి నిర్వహించే అగ్ని గుండాల తో మహా జాతర ముగు స్తుంది. నేడు మల్లన్న కల్యాణోత్స వంతో మహా జాతర ప్రారం భం కానున్న నేపథ్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రా న్ని అందంగా ముస్తాబు చేశారు.
జనవాహి నికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మల్లన్న కల్యాణం కాశీ పీఠాధిపతి శ్రీమద్ జ్ఞాన సింహాసనాధీశ్వర 1008 జగద్గురు మల్లికా ర్జున విశ్వ రాధ్యా శివ చార్య పర్యవేక్షణలో వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లన్న కల్యాణం జరిగినది వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్న వంశస్తులు, వధువులు మేడలాంబ, కేతమ్మ తరపు న మహాదేవుని వంశస్థులు పెండ్లి పెద్దలుగా వ్యవహరిం చనున్నారు.
వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పురోహితులు. కల్యాణ మహోత్సవానికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జనగామ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఏ సి పి వాసాల సతీష్ సీఐ ఎల్ శ్రీను ఆధ్వర్యంలో 400 మంది పోలీస్ సిబ్బందితో జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు