ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలో కనీవినీఎరుగనిరీతిలో.. ఎవరూ, ఎప్పుడూ, ఎక్కడా వ్రాయని, రచించని, నిర్మించని విధంగా.. ఎంతో త్యాగనిరతి, పోరాటపటిమ, అకుంఠితదీక్ష.. మొండిపట్టుదల, మొక్కవోనిఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం.. మహత్తరమైన, మహోన్నతమైన ఆలోచనా విధానం.. ముందుచూపు, దూరదృష్టితో.. అధ్భుతమైన, అత్యద్భుతమైన “భారత రాజ్యాంగాన్ని” భారత ప్రజలమైన “మన కోసం, మనబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం” నూటికి 98 శాతంగా వుంటున్న స్వదేశీ మూలనివాసులైన, భూమిపుత్రులైన.. ఒకప్పటి అఖండ జంబుద్వీపవాసులైన నేటి “మహాజన సమూహం, నిమ్న సమాజం, శూద్ర వర్ణం” సహా అన్ని కులాల, మతాల, ప్రాంతాల, వర్ణాల, వర్గాల అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామికవాద భావజాల ముద్దుబిడ్డల కోసం.. మన అయ్య, మన మాస్టర్, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, భారత జాతి ముద్దుబిడ్డ, బాబాసాహెబ్ Dr.B.R AMBEDKAR గారు సహా మరికొంతమంది రాజ్యాంగ రచనా సంఘం సభ్యులు కలిసి అందిస్తే, నిర్మిస్తే.. దానిని చక్కగా ఉపయోగపెట్టుకొని.. దాని ఉద్దేశాలను, లక్ష్యాలను, ఆశయాలను.. ఫలాలను, ప్రయోజనాలను, ఆయాచితలబ్ధి, నిర్ధిష్ట కాలపరిమితిలోపు సాధించుకోండని, పొందండని సూచిస్తే, ఉపదేశిస్తే, నిర్ధేశిస్తే, ఆదేశిస్తే.. నేడు మనం అటువంటి గురుతర బాధ్యతను మరచి, విస్మరించి.. ఇష్టారాజ్యంగా బాధ్యతలేదూ అన్నట్లు ఎవరికివారు ఎటుపడితే అటూ నడుచుకొంటూ , వ్యవహరిస్తూ, వాడుకుంటూ.. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, విశిష్ఠతను, గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, అందాన్ని, మౌలిక స్వరూపస్వభావాన్ని మొత్తం.. అజ్ఞానం, అంధకారం, అహంకారం, అహంభావం, అవగాహణరహిత మూర్ఖత్వ చర్యలు, పనులతో కుక్కలు చించిన విస్తరిలా చేసుకుంటున్న పరిస్థితి నేడు మనకు స్పష్టంగా కనపడుతోంది.
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశం యొక్క విలువ, గౌరవం.. ప్రధాన్యత, ప్రాముఖ్యత.. రుచి, అందం, తియ్యదనం తెలియని సామాన్యమైన వ్యక్తి, వ్యక్తులు, శక్తులు.. అలా చేశారు అంటే దానికొక అర్ధం, పరమార్థం వుంటుంది.సక్షాత్తూ న్యాయ, రాజ్యాంగ శాస్త్రాలు సహా రాజకీయ శాస్త్రాలు చదివి.. రాజ్యాంగ స్థానాలలో, పదవులలో, హోదాలలో వున్నవాళ్ళు సైతం రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ప్రభలప్రభావాన్ని గుర్తించకపోవడం, గౌరవించకపోవడం.. అందుకనుగుణంగా పనిచేయకపోవడం నిజంగా బాధేస్తుంది.బాధ్యతగల భారత పౌరులు సహా అత్యున్నత స్థానాలలో ఉన్న వ్యక్తులు, శక్తులు చేయాల్సిన పనులు, చర్యలు ఇవేనానన్న ఆవేదన, మనోవ్యాకులత కలుగుతోంది.ఇద్దరి వ్యక్తుల, కుటుంబాల మధ్య.. సమూహాల, సమాజాల మధ్య.. కులాల, మతాల, ప్రాంతాల మధ్య.. ఏదో కారణంచేత తగువు, వివాదం, సమస్య వస్తే.. సదరు పౌరుల మధ్య “సామరస్య, సుహృద్భావ, సోదరభావ” వాతావరణం, ప్రజాస్వామ్య పరిస్థితులు నెలకొల్పి.. “చర్చలు, సంప్రదింపులు, సంభాషణల”ద్వారా సదరు సమస్య, తగవు, వివాదాన్ని శాస్త్రీయ దృక్పథం, హేతువాద దృష్టి సహా మార్గాల ద్వారా పరిష్కరించే గురుతర బాధ్యత మానవీయ, నాగరిక, ఆధునిక సమాజంపై లేదా?.
సాంప్రదాయ పద్ధతులు, కట్టుబాట్ల ద్వారా సమస్య పరిష్కారం కానప్పుడు.. రాజ్యాంగ చట్టాలు, శాసన, న్యాయ పక్రియల ద్వారా నిష్పక్షపాతపాత బుద్ధి సహా నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, అంకితభావంతో పరిష్కార మార్గాలను అన్వేశిస్తే.. సమస్య పరిష్కరించబడదా? అలా చేయకపోవడం వల్లనే కదా! సమస్య పరిష్కరించ బడకుండా మరింతజటిలమయ్యింది.
ఇందుకు మనమంతా 141 కోట్ల మంది ప్రజలు మొత్తం విఫలం చెందినట్లె కదా! అందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లే కదా! ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో బాధ్యతగల పౌర సమూహం, సమాజం ఏనాడైనా ఆలోచించిందా? అద్భుతమైన, ప్రపంచానికే ఆదర్శ రాజ్యాంగ చట్టాలు, శాసనాలు, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థ సమస్తం.. అవసరాన్నిబట్టి కఠినంగాను మరియు మృదువుగాను (Rigid and Flexible) గాను మలుచుకునే అవకాశం వున్నా.. మనమెందుకు గోరవైఫల్యం చెందుతున్నామో ఎప్పుడైనా గుండెలమీద చెయ్యి వేసుకొని “అంతరాత్మను” ప్రశ్నించుకున్నామా?.నిష్పక్షపాత, నిజాయితీ తీర్పులు ఇస్తే.. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఎందుకు గుర్తించరు, గౌరవించరు, ఆమోదించరు? అంటే మన నిర్ణయాలలో, చర్యలలో, తీర్పులలో ఎక్కడో లోపం ఉన్నట్లే కదా! ప్రజల, ప్రజాస్వామికవాదుల నమ్మకాలు, విశ్వాసాలను కోల్పోయినట్లే, కోల్పోతున్నట్లె గదా!.ఇప్పటికైనా అత్తున్నతా “రాజ్యాంగ చట్ట, కార్యనిర్వాహక, న్యాయ బాధ్యతలు సహా ప్రభుత్వ బాధ్యతల్లో” వున్నవారు తమ హృదయాలను, మనసులను అత్మపరిశీలన చేసుకొమ్మని.. భారత రాజ్యాంగం పౌరులకిచ్చిన అత్యున్నత సూత్రాలు, మూలసూత్రాలు, ప్రాథమిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు.. చట్ట, న్యాయ నిబంధనలు, నియమాలు.. విలువలు, ఆదర్శాలుకు రోజురోజుకు మరింత వన్నె, విలువ, గౌరవం పెంచేలా ప్రవర్తించాలని, నడుచుకోవాలని, వ్యవహరించాలని ఈ సందర్భంగా బాధ్యతగల భారత పౌరులందరికీ (All the Responsible Citizans of INDIA) హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా:రండి.. ప్రపంచంలో కెల్లా అత్యద్భుతమైన, మహత్తరమైన, మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల ఆలోచనా విధానంతో ముందుకెళుదాం..
నిష్పక్షపాతబుద్ధి, నిజాయితీ, నిస్వార్థ తీర్పులతో.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశం పట్ల పౌరులకు మరింత గౌరవం సహా నమ్మకం, విశ్వాసం, విధేయత కలిగేలా చేద్దాం.. మనకున్నంత పదునైన రాజ్యాంగ చట్టాలు, శాసనాలు, న్యాయ వ్యవస్థ.. ప్రపంచంలో ఎవరికి లేదని సగర్వంగా ప్రపంచానికి చాటుదాం…