కురపాం మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని తేల్చిన హైకోర్టు..
ఆంధ్రప్రదేశ్ కురపాం
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 21:
ఏపీలో మాజీ మంత్రి పుష్ప శ్రీ వాణి ఎస్టీ కులానికి చెందిన వారేనని హైకోర్టు తీర్పును ఇచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
డి.ఎల్.ఏస్.సి
కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో 6ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ వద్ద ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. కాగా ఆమె ఎస్టీ కాదంటూ ఇద్దరు వ్యక్తులు 2019లో పిటిషన్ వేశారు. ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి అన్నారు.