డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా
మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఒక మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు
రామయంపేట్ సిఐ వెంకట్ రాజా గౌడ్ వెల్లడి
మెదక్ జిల్లా వెల్దుర్తి,జనవరి 12
సభ్య సమాజం తలదించుకునే ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ జాతీయ రహదారి పక్కన అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఒక మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈనెల ఎనిమిదో తేదీన ఉదయం తెల్లవారుజామున రోడ్డు పక్కన అంబేద్కర్ విగ్రహం వద్ద ఆశ్రయం పొందుతున్న ఒక మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు అగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
మద్యం మత్తులో ఉన్న యువకులకు రోడ్డుపై వెళ్తున్న మహిళ కనిపించగా ఆమెను తీసుకెళ్లి సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒకరి వెనుక ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం సీసీ కెమెరాలు రికార్డ్ అయినప్పటికీ నిందితులు ఎవరు దాన్ని గమనించలేదు. గ్రామంలో 10వ తేదీన స్వామి కి చెందిన ఒక్క బర్రె తప్పిపోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో పోలీసులు సీసీ కెమెరా తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన మతిస్థిమితం లేని సుమారు 30 సంవత్సరాల యువతీ పై అత్యాచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలిని మెదక్ భరోసా కేంద్రానికి తరలించారు. దీంతో రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు