గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 15 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సింగరేణి కాంటాక్ట్ కార్మికులు అనారోగ్యంతో విధులకు గైర్హాజరయితే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్ల ద్వారా విధిస్తున్న అ మానవీయ పెనాల్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.శనివారం నాడు మణుగూరు ఏరియా కొండాపురం సి ఎస్ పి లో జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు అనారోగ్యానికి గురయ్యో లేదా మరొక అత్యవసర పని మీదనో విధులకు రాలేక పోతే తమ జీతాన్ని కోల్పోవడంతో పాటు సింగరేణి యాజమాన్యానికి తిరిగి పెనాల్టీ కాంట్రాక్టర్ ద్వారా ఎదురు డబ్బులు చెల్లించడం దీన్ని కఠినంగా అమలు చేయటం అమానవీయమని ఆయన అభ్యంతర వ్యక్తం చేశారు, అర్హులైన సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. అనంతరం ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు ఏడో గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్వహించ తలపెట్టిన ఈనెల ఇరవయ్యో తేదీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ప్రచార కరపత్రాలను కాంట్రాక్ట్ వర్కర్ తో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, మణుగూరు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్, పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గం ప్రణయ్, ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్)జిల్లా కమిటీ సభ్యులు సాధన పల్లి రవి, సింగరేణి ఓ బి వర్కర్స్ యూనియన్ నాయకులు పెనుగొండ నాగార్జున, కాంట్రాక్ట్ వర్కర్స్ వెంకటేశ్వర్లు, భద్రం, నగేష్, సంజీవరావు, లక్ష్మీనారాయణ, పిచ్చయ్య, లింగయ్య, కృష్ణ, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల అమానవీయ పెనాల్టీ రద్దు చేయాలి
