కమ్యూనిస్టులుమరణించిన చిరకాలం ప్రజల హృదయాలలో జీవించి ఉంటారు.

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 24 

కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోగల

2ఇంక్లైన్ గ్రామపంచాయతీలో ఘనంగా లోషహీద్ భగత్ సింగ్ ,సుఖదేవ్ ,రాజ్ గురు ల వర్ధంతిఅమర జీవులు కామ్రేడ్స్

షహీద్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల 94 వ వర్ధంతి సందర్భంగా 2ఇంక్లైన్ సిపిఐ శాఖా కార్యదర్శి కామ్రేడ్ మహమ్మద్ అంకుష్ ఆధ్వర్యం లో అమరజీవి కామ్రేడ్ ఆడేపు లక్ష్మీ నారాయణ స్మారక భగత్ సింగ్ స్థూపం వద్ద ఘనంగా 94వవర్ధంతి కార్యక్రమం నిర్వహించటం జరిగింది. కార్యక్రమం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫెలోషిప్

అవార్డు గ్రహీత సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు అభ్యుదయ కవి. తూముల శ్రీనివాస్ పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులు నూనుగు మీసాల ప్రాయం లో దేశం కోసం, సంపూర్ణ స్వాతంత్ర స్వరాజ్యం స్థాపన కోసం చిరునవ్వుతో ఉరి కొయ్యలను ముద్దాడిన సందరభాన్ని గుర్తు చేశారు.నేడు భారత యువతను తప్పుదోవ పట్టించడానికి చరిత్రను మార్చి చిత్రాలను మతతత్వ ప్రభుత్వాలే వెనుకుండి నడిపిస్తున్నారని ఆయన అన్నారు. భగత్ సింగ్ తన ప్రాణాలను అర్పించి తెచ్చిన చైతన్యం నీరు కార్చే ప్రయత్నాలు నేటి మతతత్వ పార్టీలు చేస్తున్నాయి అని, తమ రాజ్యాలను కాపాడుకోవడం కోసం యుద్ధాలు చేసిన రాజుల కన్నా దేశాన్ని, దేశ ప్రజల స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ నూటికి నూరు శాతం గొప్ప వాడని,ఆయన త్యాగం భారత సమాజం మరువలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గో సర్పంచ్ గుగులోత్ నగేష్,ఉప సర్పంచ్ సింగిరాల రమేష్, సీనియర్ నాయకులు ఆదినారాయణ రావు, గడ్డం మురళీ, సామల విజయ్, మల్లేష్,యువ నాయకులు తూముల శివ, జంపన్న,శ్రీను, మహేష్, యాకూబ్ పాషా, మహిళా నాయకురాలు కలమ్మా తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now