విశ్రాంత ఉద్యోగులుగా తమవంతు సహకారం అందిస్తాం
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 18 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
గ్రంథాలయం కోసం ఏర్పాటు చేసిన నూతన భవనం కార్పొరేట్ స్థాయిలో ఆకట్టుకునేలా ఉందని విద్యానగర్ కాలనీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు, కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు.
మంగళవారం నూతన గ్రంథాలయ భవనాన్ని సందర్శించిన వారు అందుబాటులోనికి తెచ్చిన సదుపాయాలు సౌకర్యాలపై స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వపరంగా కార్పొరేట్ స్థాయిలో చక్కటి వాతావరణం ఆహ్లాదకరమైన పరిస్థితుల నడుమ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ నూతన భవనం లోని ఏర్పాట్లను చూస్తుంటే ఇది నిజంగా ప్రభుత్వ కార్యాలయమైన అనే అనుమానాలు వ్యక్తం కాక మానవని చెప్పారు. ఇక్కడున్న సదుపాయాలను చూస్తుంటే వేరే రేంజ్ లో ఉన్నాయని, విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తేవడం గమనార్హం అని చెప్పారు. గ్రంథ పాలకురాలుగా పనిచేస్తున్న మణి మృదుల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి అనునిత్యం అందుబాటులో ఉంటూ సహకారం అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ మధ్యకాలంలో గ్రంథాలయం పై ఆధారపడి చదివిన అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం వెనుక గ్రంథ పాలకురాలి కృషి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని తెలిపారు. గతంలో మాదిరిగానే నూతన గ్రంథాలయానికి కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి విశ్రాంత ఉద్యోగుల తరఫున సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి కేశవరావు, రాములు, శివరామకృష్ణ, గురుమూర్తి, సాంబయ్య, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ అధునాతన భవనం ఆకట్టుకునేలా ఉంది
