సమగ్ర కుటుంబ సర్వేతోనే రాష్ట్రంలో అట్టడుగు..
-ఎమ్మెల్యే మదన్ మోహన్
-గ్రామస్థులు అధికారులకు సహకరించాలి
ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వే కార్యక్రమం లో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మండలం అన్నసాగార్, రుద్రారం, జంగమయిపల్లి గ్రామాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ. సమగ్ర కుటుంబ సర్వేతోనే రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న కులాలు, ఇతర పేదలు ఆర్థికాభివృద్ధి చెంది రాజకీయంగా, సామాజికంగా రాణిస్తారని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.
ప్రతి ఒక్కరు కుల గణన పై వస్తున్న అపోహలు & అసత్యాలు నమ్మవద్దని ప్రజలకు తెలిపారు. కుల గణన కార్యక్రమాన్ని గ్రామస్థులు అధికారులకు సహకరించాలి అని ఎల్లారెడ్డి ప్రజలను ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.