*అమరవీరుడా!ఇక సెలవు*
సత్యసాయి జిల్లా:మే 11
అమరవీరుడు మురళి నాయక్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం పూర్తయ్యాయి,సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తండాలో ప్రభుత్వ అధికారుల వాంఛనాలతో వీరజవాను మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
మురళీనాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్, లోకేశ్, సవిత, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు. వీరజవాన్ మురళీనాయక్కు నివాళు లర్పించారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు.
*మురళీనాయక్ తండాగా మారుస్తాం*
మురళీనాయక్ కుటుంబా నికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
మురళీనాయక్ పార్థివదే హానికి నివాళులర్పించ డానికి వచ్చిన మంత్రి లోకేశ్, మురళి నాయక్, కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అదే విధంగా జిల్లాలో మురళీనాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
అంతేకాకుండా మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేశ్ అన్నారు.గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కల్లితండాను మురళీనాయక్ తండాగా మారుస్తామని లోకేశ్ పేర్కొన్నారు.
చిన్న వయసులో మురళీనాయక్ మృతి బాధాకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.