*పత్తి క్వింటాల్ కు గరిష్ట ధర రూ 7,050*
*వ్యవసాయ మార్కెట్ జమ్మికుంటలో*
*జమ్మికుంట మార్చి 3 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు విడి పత్తి 177 క్వింటాళ్లు 14 వాహనాలలో రైతులు మంగళవారం విక్రయానికి తీసుకు వచ్చారు. గరిష్ట దర రూ7,050 ,మోడల్ ధర రూ 7,000, కనిష్ట ధర రూ 6,400 పలికింది.కాటన్ బ్యాగ్స్ లలో 12 క్వింటాల్లు 8 మంది రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. గరిష్ట ధర రూ 6200, మోడల్ ధర రూ 5800 ,కనిష్ట ధర రూ5500 పలికిందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్ మల్లేశం రైతులకు సూచించారు.