సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాటను పరిశీలించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
సభా వేదికతో పాటు హెలిప్యాడ్ నిర్మాణాల పరిశీలన..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గ కొందూర్గు మండల కేంద్రంలో పర్యటిస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గత రెండు రోజులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభ వేదికతో పాటు హెలిప్యాడ్ నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తదితర అంశాలను కూడా ఆయన స్థానిక కార్యకర్తలు నాయకులతో అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కార్యకర్తలను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం అయ్యేవరకు అందరూ కార్యకర్తలు నాయకులు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. 150 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమం ఈ నియోజకవర్గంలోని కనివిని ఎరుగని రీతిలో జరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా నాలుగు నెలల రహదారికి సంబంధించి కూడా మంచి మహర్దశ కలుగుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాత్రింబవళ్లు సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గర ఉండి చూసుకోవడం ప్రతి కార్యకర్తను కార్యక్రమం కోసం సిద్ధం చేయడం చెప్పుకోదగ్గ విషయాలు..