Site icon PRASHNA AYUDHAM

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Screenshot 2024 11 21 19 06 58 82 92460851df6f172a4592fca41cc2d2e6 1

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 21, కామారెడ్డి :

కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు రావడం లేదని తెలిసి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఏ విధంగా ఉంటుందని, మెనూ ప్రకారం ఇస్తున్నారా అని, టాయిలెట్ల సౌకర్యం ఎలా ఉందని విద్యార్థులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరును తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమయానికి రావాలని లేనట్లయితే తగు చర్యలు ఉంటాయని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు.

Exit mobile version