*ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలి*
*ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*
*జమ్మికుంట హుజరాబాద్ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 13*
ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు స్థానిక హుజూరాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాను అనంతరం వారు మాట్లాడుతూ…హుజురాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా భయానక వాతావరణానికి తెరలేపి లేనిపోని గొడవలు,విధ్వంసాలు సృష్టిస్తూ ప్రాంతీయ విబేధాలు అంటూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూ ఇరు పార్టీల నాయకులను(కాంగ్రెస్, బిఆర్ఎస్ )రెచ్చగొడుతూ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు సృష్టించి రాజకీయంగా కౌశిక్ రెడ్డి తమ పార్టీ పెద్దల వద్ద మన్ననలు పొందడం కోసం సామాజిక మాధ్యమాల్లో మీడియా లో ఎప్పటికీ ఏదోఒక వార్తల్లో నిలవడం కోసం మహిళలను కించపరుస్తూ చీర,గాజుల అంటూ మీడియా ద్వారా గొడవలు సృష్టించి అధికారులను సైతం విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఇలాంటి వ్యక్తుల పట్ల తెలంగాణ సమాజాన్ని పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సందమల్ల నరేష్, టేకుల శ్రావణ్,బండ నవీన్,జంగ అనిల్,లంకదాసరి గంగరాజు,ఇప్పలపల్లి చంద్రశేఖర్,నరెడ్ల వినోద్ రెడ్డి, చల్లూరి విష్ణు వర్ధన్,చెంచల మణిదీప్, జన్ను ప్రసాద్, ఆకునూరి అజిత్ ,నాగరాజు,కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.