*ఏజెన్సీ ప్రాంత ఎస్సి,బిసి కులాల జడ్పిటిసి,ఎంపీటీసీ అమలు కొరకు*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి అమలు చేయాలి*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 10 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి,బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు ఆయన నివాసంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ,బీసీ కులాల ఎంపీటీసీ,జడ్పీటీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చించి అమలు చేయించాలని కోరారు.2023 అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ జెడ్పిటిసి,ఎంపీటీసీ స్థానికంగా అభివృద్ధి,అవకాశాలు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు అన్యాయం జరిగింది,న్యాయం చేయాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేద్దామని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ఈ ఆనాటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడం లేదు కావున కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులకు ప్రభుత్వంతో చర్చించి ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2014 నోటిఫికేషన్ ఆధారంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందని తెలియజేశారు.బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కోరగాయని శ్రీనివాసరావు, మిట్టపల్లి సాంబయ్య, మహంకాళి బిక్షపతి, పుట్నాల సాంబయ్య, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు సలిగంటి కొమరయ్య, కండె రాములు,రజిని అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేనికి విన్నపము
