నూతన బోర్ ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

నూతన బోర్ ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 20, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలోని 46 వ వార్డులో నీటి సమస్య ఉందని కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి బోర్ వేయించారు. నీటి సమస్య తీర్చడానికి మున్సిపల్ చైర్మన్ శుక్రవారం కొబ్బరికాయ కొట్టి బోర్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ సూచన మేరకు కామారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా నీటిని సంరక్షించుకోవడం, చెట్లు నాటడం ప్రతి ఒక్కరి భాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడి పచ్చదనం పెంచాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య, పంపరి లతా శ్రీనివాస్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now