*వీడిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు..
*8 మంది నిందితులు అరెస్టు*
*కారు, 2-ఎరుకలి కొడవల్లు,1 కత్తి, రూ 1,20,000 రూపాయల నగదు స్వాధీనం*
*10 మొబైల్ పోన్ లు, జీపీఎస్ ట్రాకర్ స్వాధీనం*
జోగులాంబ గద్వాల జిల్లా (జూన్ 26): తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసు ను జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు చేధించారు. తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్ రావు కలిసి తేజేశ్వర్ ను సుఫారీ గ్యాంగ్ తో మర్డర్ చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.