మళ్లీ పిడుగు లాంటి వార్త.. దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలివే..

మళ్లీ పిడుగు లాంటి వార్త.. దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలివే..

మరో పిడుగులాంటి వార్త.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్​ మహమ్మారి మరోసారి కొత్త రూపు దాల్చింది.

తాజాగా XEC అనే కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడం.. ఇప్పటికే 27 దేశాల్లో గుర్తించడం ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయిందనుకుంటున్న తరుణంలో ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇది మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది..

పలు దేశాల్లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XEC కేసులు వేగంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ వేరియంట్ యూరప్ అంతటా వేగంగా వ్యాప్తిచెందుతోందని వెల్లడించారు. త్వరలోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.

కోవిడ్19 XEC వేరియంట్ ను తొలిసారిగా జర్మనీలో గుర్తించారు.

ఈ వేరియంట్ లక్షణాలు మునుపటి స్ట్రెయిన్ల మాదిరిగానే ఉంటాయని, ఇది గతంతో పోలిస్తే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటంతోపాటు.. ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

*ఎక్స్ఈసీ వేరియంట్ లక్షణాలివే..*

తీవ్రమైన జ్వరం, నొప్పులు, అలసట, దగ్గు లేదా గొంతులో మంట – నొప్పి, చాలా మంది వారాల్లోనే కోలుకుంటారని.. అయితే కొంతమందిలో దీర్ఘకాలిక లక్షణాలు కనిపిస్తాయంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు వాసన తెలియక పోవడం, ఆకలి లేకపోవడం ద్వారా కొత్త రకం కోవిడ్ ఎక్స్ఈసీ లక్షణాలను గుర్తించవచ్చంటూ పేర్కొంటున్నారు. పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది.

Join WhatsApp

Join Now