ట్రంప్పై భారతీయుల ఆగ్రహం
కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానంటూ US అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ఏదైనా చేయాలనుకుంటే మీ సామర్థ్యంతో ఉగ్రవాదుల ఏరివేతలో భారత్కు సహకరించాలి. అంతే కానీ భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టకూడదు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఆ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో భారతీయులకు తెలుసు’ అంటూ నెట్టింట మండిపడుతున్నారు.