పంచాయతీ కార్యదర్శి ని వెంటనే సస్పెండ్ చేయాలి

*పంచాయతీ కార్యదర్శి ని వెంటనే సస్పెండ్ చేయాలి*

*మండల ఎంపీఓ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి*

*మాజీ సర్పంచి తో కుమ్మక్కు కావడం మూలంగానే పంచాయతీ కార్మికుడికి ఆన్లైన్లో పేరు నమోదు చేయకుండా అన్యాయం చేశారు*

*సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్*

*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 25 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలో శ్రీరాములపల్లి గ్రామపంచాయతీలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడి పేరును ఆన్లైన్లో నమోదు చేయకుండా, తాత్కాలిక రోజువారి పనిలోకి తీసుకున్న కార్మికుడ్ని గత మాజీ సర్పంచ్, బంధువైనందున ఆన్లైన్ రికార్డులు నమోదు చేయడం జరిగిందని, ఇట్టి విషయంపై జిల్లా పంచాయతీ అధికారి మండల ఎంపీవో వాళ్లకి ఫిర్యాదు చేసినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామమాత్రపు విచారణ చేసి అధికారులు ప్రజాప్రతినిధి తో కుమ్మక్కై పారిశుద్ధ్య కార్మికునికి అన్యాయం చేస్తున్నారని ఇప్పటివరకు రెండు నెలలు అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్మికుడు మనోవేదన గురై ఆత్మహత్య చేసుకునే స్థాయికి వేధించారని ఇది సరైనది కాదని, ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం ఆన్లైన్లో సీనియార్టీ ప్రాతిపదికన పర్లపల్లి మల్లేష్ పేరును నమోదు చేయాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నామని, లేదంటే ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని అవసరమైతే కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల సిఐటియు నాయకులు, కొత్తూరు మల్లయ్య, రావుల ఎల్లయ్య, రేణిగుంట్ల సారయ్య,గంధసిరి సంపత్, రాజు ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment