ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు కాపాడాల్సిన బాధ్యత కస్టోడియన్ గా ఉన్న కళాశాల ప్రిన్సిపాల్ దే.

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 19, కామారెడ్డి :

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి నిరసనగా కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు విద్యార్థి సంఘాలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కాలేజీ భూములకు కస్టోడియన్ గా ఉన్న ప్రిన్సిపాల్ దీనిపై వెంటనే స్పందించాలని, అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న సరస్వతి శిశు మందిర్ పాఠశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఎంతోమంది రైతులు చెమటోడ్చి పండించిన పంటలో నుండి విరాళాలు
సేకరించి తమ పిల్లల విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తు తరాల బంగారు భవితను, పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించడం కోసం ఈ భూముల్ని కొన్నారు. ఈ భూములలో కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే ఆలోచనతో చేసిన శ్రమ ఈ కళాశాల భూములు ఈరోజు అన్యాక్రాంతం దిశగా వెళ్తున్నాయని , కావున కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వీటి జోలికి ఎవరు వచ్చినా తదుపరి చర్యలకు బాధ్యులవుతారన్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ వెంటనే స్పందించాలని లేనియెడల విద్యార్థి సంఘాల అగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, అదేవిధంగా భవిష్యత్తు పోరాటాలకు సైతం విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయని వాటి పర్యావసానాలు అన్నింటికీ పూర్తి బాధ్యత కస్టోడియన్ గా ఉన్న కళాశాల ప్రిన్సిపాల్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, ఎస్ ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముదాం అరుణ్, బివిఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విటల్, టివిఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ , భరత్, ఫణి, రాహుల్, ప్రియాంక, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now