మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

మున్సిపల్ కార్మికుల సమస్యల పైన శనివారం మున్సిపల్ కార్మిక సంఘం ( సిఐటియు ) ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు రాజనర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మున్సిపల్ కార్మికుల పెండింగ్ జితాలు ఇవ్వాలని, ఈపీఎఫ్,

ఈఎస్ఐ పెండింగ్ డబ్బులు కార్మికుల అకౌంట్లో జమ చేయాలని, మున్సిపల్ కార్మికులకు కేటగిరి వారిగా జీవో నెం 60 ప్రకారం పెరిగిన జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై వినితి ఇవ్వడం జరిగిందన్నారు.

4 5 తేదీల్లో మున్సిపల్ ముందు దీక్షలు

రాష్ట్ర కమిటీ పిలుపులొ భాగంగా జనవరి 4.5 తేదీలలో 48 గంటల మున్సిపల్ కార్యాలయం ముందు దీక్షలు ఉంటాయని, అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు దర్న కార్యక్రమం ఉంటుందన్నారు. జనవరి 27 తర్వాత మున్సిపల్ కార్మికుల పర్మెంటు కనీస వేతనాలు 26 రూపాయలు పరిష్కారం కాకపోతే సమ్మెలకు పోతామని వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి సానుకూలంగా స్పందిస్తూ చైర్పర్సన్ రెండు, మూడు రోజుల్లో మీ జీతాలు అందే విధంగా చూస్తామని, దాంతోపాటు పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కార్మికుల అకౌంట్లో జమ అయ్యేవిధంగా చేస్తామని స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహబూబ్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్, కాట్రియాల ప్రభు, దీపక్, శివరాజవ్వ, గంగాధర్, జ్యోతి, రవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now