ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గూగులోత్ వంశీ
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
జూలూరుపాడు నవంబర్ 10:
ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ హాస్టల్ సందర్శనకు వెళ్లినఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ మండలంలో ఉన్న పలు హాస్టల్లో సందర్శించి వంశీ విద్యార్థులు మాట్లాడుతూ పలు సమస్యలు వెలికి తీశారు వంశీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాస్మోటిక్ మెస్ చార్జర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది దాన్ని అభినందిస్తూ
నరసాపురం లో ఉన్న బాలికల హాస్టల్ ముఖ్యంగా పారి గోడ కూడా లేదని హాస్టల్ గుట్ట పక్కన మేడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందని ఇద్దరి తల్లిదండ్రులు గురవుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించాలని కోరారు .పెంచిన మెస్ చార్జీలను ఈనెల నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాలు నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనం నిర్మించాలని అన్నారు. కొన్ని సంక్షేమ వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు లేక విద్యార్థి అనేక అవస్థలు పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్ష జరుపకపోవడం బాధాకరమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. చలికాలం వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమంలో పిలుపునిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు సాయి తేజ, రామ్ చరణ్ ,తేజ పునీత్ కుమార్ ,హేమంత్ తదుపరులు పాల్గొన్నారు.