తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వర రావు అన్నారు.
కొత్తగూడెంమున్సిపాలిటీ,పాల్వంచ మున్సిపాలిటీ నీ కలిపి అందులో మరి కొన్ని మండల లో లక్షీదేవిపల్లి ,చించుపల్లి ,సుజాతనగర్ లో కొన్ని ఏజెన్సీ గ్రామాలను కలుపు కొని మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని అన్నారు, పై మూడు మండలాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నవి అవి 5వ శడ్యూల్డ్ భూభాగం లో ఉన్న ప్రాంతాలు 1/70 చట్టం, పేసా చట్టం అమలులో ఉన్న ప్రాంతం , ఈ చట్టాలకువిరుద్ధంగా ఏజెన్సీ భూభాగాన్ని అబివృద్ధి పేరిట విధ్వంసానికి పాల్పడటం మానుకోవాలని అన్నారు. ఇంక అభివృద్ధికి నోచుకోని ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల విద్య,వైద్యం,ఉపాది అందక సతమతం అవుతుంటే ప్రభుత్వాలు కార్పొరేషన్ చేయటం వలన ఏజెన్సీ హక్కులు చట్టాలు కోల్పోతామని, ఏజెన్సీ ప్రాంతాలను విడగొట్టలనే ప్రయత్నం మానుకోవాలనీ ,అధికారులకు ఆదివాసీల మీద చిత్త శుద్ధి ఉంటే ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలని,5వ శాడ్యూల్డ్ భూభాగం ఆదివాసీలకు కన్న తల్లితో సమానం అని అటువంటి కన్న తల్లి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు తమ చట్టాలు హక్కులు కాపాడుకోవటం కోసం తుడుందేబ్బ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు పోరాటాలు చేపడతామని అన్నారు.