Site icon PRASHNA AYUDHAM

విద్య హక్కు చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి

IMG 20250620 WA0277

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 20 కొత్తగూడెం డివిజన్
కార్పొరేట్, ప్రైవేటు విద్య సంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలి.
విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి.
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ*
జూలూరుపాడు: మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ* డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఫీజు దోపిడీని అరికట్టాలినీ, విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలినీ డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎంఈఓ జుంకీలాల్ కి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వంశీ మాట్లాడుతూ విద్యా సంవత్సరం పున ప్రారంభమైనందున ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి తక్షణమేపాఠ్యపుస్తకాలు యూనిఫాంలో విద్యార్థులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొన్నిచోట్ల అరకొర వసతులు మాత్రమే ఉన్నాయని అన్నారు. మండలంలోని కొన్ని గ్రామాలలో సరిపడ గదులు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలో ఉన్న విద్యారం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పునీత్ కుమార్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version