జనగామ జిల్లా సాధనలో సిపిఎం పాత్ర కీలకమైంది…

జనగామ జిల్లా సాధనలో సిపిఎం పాత్ర కీలకమైంది…

జిల్లా ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.

బూడిద గోపి సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు..

ప్రపంచ ఖ్యాతిగాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురుడు పోసి ఊపిరిలూదిన జనగామ గడ్డ ఎంతోమంది అమరుల రక్తతర్పణం వీరోచితమైన ఘన చరిత్ర కలిగిన జనగామ ప్రాంతాన్ని నాటి KCR ప్రభుత్వం జంగామ కు జిల్లా ఇవ్వకుంటే ఊరుకునేది లేదని ఉవ్వెత్తున సాగిన జిల్లా సాధన ఉద్యమంలో సిపిఎం పాత్ర కీలకమైనదని ఆఉద్యమంలో సిపిఎం కీలక దశలో పాల్గొని పోరాటం విజయవంతం అయ్యేంతవరకు ఉద్యమకారులతో చివరి వరకు సాగిందని సిపిఎం జిల్లా జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి అన్నారు.జనగామ జిల్లా సాధించుకొని పదో సంవత్సరంలో అడిగిన సందర్భంగా జనగామ బస్టాండ్ చౌరస్తాలో జిల్లా కీర్తి స్తూపం వద్ద జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన జరిగిన సభలో వారు పాల్గొని మాట్లాడుతూ జనగామ ప్రాంత వీరోచన చరిత్రను చైతన్యాన్ని ఆస్తిత్వాన్ని ముక్కలు చేయాలని జనగామ జిల్లాను ఇవ్వకుండా నాటి BRS పాలకులు కుట్ర కుట్రపన్ని జనగామ ప్రాంతాన్ని ముక్కలు చెక్కలుగా చేసి వివిధ జిల్లాలలో కలపాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో జనగామ ప్రాంతంలోని యువకులు సాహితీ కళాకారులు ప్రారంభించిన జిల్లా పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తులు సంస్థలు పాలుపంచుకొని ఉద్యమాన్ని స్థారాస్థాయికి తీసుకుపోయిన సందర్భంలో పోరాటాన్ని అణిచివేసి కుట్ర కేసులు పెట్టి జైలకు పంపి 144 సెక్షన్ విధించి ఉక్కు పాదంతో ఉద్యమాన్ని అనుచాలని చూసిన సందర్భంలో సిపిఎం జిల్లా ఉద్యమంలోకి వచ్చిందని జేఏసీ నాయకులను సమన్వయం చేసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశామన్నారు.అలాగే నాటి ముఖ్యమంత్రి వద్ద నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చారిత్రక నేపథ్యం కలిగిన జనగామ జిల్లాగా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పక్షాన రాతపూర్వకంగా లేక ఇచ్చిన ఏకైక పార్టీ సిపిఎం అన్నారు.అలాగే నాటి అసెంబ్లీలో జనగామ జిల్లా ఇచ్చి తీరాల్సిందేనని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అసెంబ్లీలో చర్చ పెట్టారు అంతేకాకుండా జన గర్జన బహిరంగ సభకు హాజరై మద్దతు పలికారు.అలాగే వీరోచితంగా సాగుతున్న దీక్షలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు వీరనారి మల్లు స్వరాజ్యం నేటికీ బతికున్న 106ఏళ్ల దర్గా నాయక్ దీక్షలో పాల్గొని జనగామ జిల్లా ఆవశ్యకతను కేసీఆర్ ప్రభుత్వానికి తెలియచెప్పారు అన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ప్రజల పోరాటం ఫలితంగా జనగామ జిల్లా సాధించుకున్నామని సాధించుకున్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా సిపిఎం ఏసిరెడ్డి నగర్ ప్రజలు త్యాగం చేశారు కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ఏ జిల్లాలో లేని విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం నిర్మించుకోగలిగామని తెలిపారు. జిల్లా సాధన ఉద్యమంలో ఉద్యమకారులపై పోలీసులు పాలకులు పెట్టిన అక్రమ కుట్ర కేసులు అన్నిటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.పోరాడి సాధించుకున్న జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకి అతీతంగా మరో పోరాటం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ధర్మపురి కాంగ్రెస్ నాయకులు జక్కుల వేణుమాధవ్ టిడిపి నాయకులు బైరు బాబు జనగామ రచయితల సంఘం నాయకులు జి కృష్ణ పెట్రోల్ సోమేశ్వర చారి చరిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ CPM పట్టణ కమిటీ సభ్యులు బొట్ల శ్రావణ్ డివైఎఫ్ఐ నాయకులు చిలుకమారి మణిరత్నం ఎమ్మార్పీఎస్ నాయకులు గద్దల కిషోర్ రాగల్ల ఉపేందర్ మీసాల వెంకన్న తుంగ కౌశిక్ ఎండి అబ్బాస్ నోముల శ్రావణ్ రంగు ప్రవీణ్ సన్నీ నరేష్ తదితరులు పాల్గొన్నారు…*

Join WhatsApp

Join Now